Andhra Pradesh: కరోనాను జయించిన 90 ఏళ్ల బామ్మ

16 May, 2021 13:57 IST|Sakshi
పర్వతం లక్ష్మీదేవి

తాడికొండ: 90 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన పర్వతం లక్ష్మీదేవి(90)కి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆమె అడవితక్కెళ్ళపాడులోని క్వారంటైన్‌ కేంద్రంలో చేరింది. 12 రోజుల క్వారంటైన్‌లో వైద్యుల సలహాలు, సూచనలను పాటించింది. ఇటీవల జరిపిన పరీక్షలో నెగిటివ్‌ రావడంతో శనివారం ఆమె ఇంటికి చేరుకుంది.

చదవండి: వైరల్‌: క్వారంటైన్‌లో ఎమ్మెల్యే చిందులు
కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన

మరిన్ని వార్తలు