ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు

15 Jan, 2021 15:24 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,696 మందికి కరోనా పరీక్షలు చేయగా 94 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,710కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 232 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,76,372 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,199. వైరస్‌ బాధితుల్లో కొత్తగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 7,139కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు