ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు

26 Mar, 2021 20:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,604 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 984 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 89,6863 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో 306 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 88,5515 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా సోకి గత 24 గంటల్లో చిత్తూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందగా, ఇప్పటివరకు 7,203 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 4145 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 1,49,16,201 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి:
కరోనా అలర్ట్‌: మార్చి 28 నుంచి రాత్రి కర్ఫ్యూ
ఇంటింటా ఫీవర్‌ టెస్ట్‌.. మినీ లాక్‌డౌన్‌

మరిన్ని వార్తలు