సాక్షి, కర్నూలు : శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంతో జరిగిన అవకతవకలపై గురువారం రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ శివన్నారాయణస్వామి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఏసీబీ అధికారులు టోల్గేట్, దర్శన టిక్కెట్ కౌంటర్, డొనేషన్ కౌంటర్లలో రికార్డుల పునఃపరిశీలన చేశారు.