సబ్‌ రిజిస్ట్రార్, ఎమ్మార్వో ఆఫీస్‌ల్లో ఏసీబీ తనిఖీలు: భారీ నగదు స్వాధీనం

27 Apr, 2023 20:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవాప్తంగా ఏసీబీ అధికారులు 7 సబ్ రిజిస్ట్రార్, 2 ఎమ్మార్వో ఆఫీస్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. కోటి 9 లక్షల 28 వేలు నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బద్వేల్‌, తిరుపతి రూరల్‌, అనంతపురం రూరల్‌, నర్సాపురం, విశాఖ, తుని, కందుకూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. మేడికొండూరు, జలమూర్‌, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.
చదవండి: AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ఇదే

మరిన్ని వార్తలు