ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌

26 Sep, 2021 05:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్‌ మంత్రి హోదాలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ కేంద్రంగా ఆదిత్యనాథ్‌ దాస్‌ పనిచేయనున్నారని జీఏడీ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వుల్లో తెలిపారు.  

మరిన్ని వార్తలు