రెండో విడత ‘నాడు–నేడు’కు లైన్‌క్లియర్

31 Mar, 2021 04:27 IST|Sakshi
నాడు, నేడు

రూ.4,446 కోట్లతో 16,345 స్కూళ్ల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు

10 కాంపొనెంట్సు కింద సదుపాయాల కల్పన

ఉత్తర్వులు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం రెండోదశ కింద 16,345 ప్రభుత్వ విద్యాసంస్థల్లో రూ.4,446 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతు లు మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 2021–22 విద్యా సంవత్స రంలో 10 కాంపొనెంట్ల కింద ఈ మౌలిక వసతు లను కల్పిస్తారు. మొదటిదశ కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,715 పాఠశాలల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. రెండోదశలో చేపట్టే పనులకు ప్రభుత్వం  పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.  

మరిన్ని వార్తలు