డీజీపీకి అజేయ కల్లం ఫిర్యాదు

21 Oct, 2020 16:51 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మంగళగిరికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి తన పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లు ఏపీ సీఎం ప్రధాన సలహాదారు, మాజీ సీఎస్‌ అజేయ కల్లం బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ముఠా తన పేరును వాడుకుని జూనియర్‌ లైన్‌మెన్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. వాట్సప్‌ పోస్టుల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డీజీపీని కోరారు. ఒకవేళ విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే వాట్సప్‌ మేసేజ్‌లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, వాటికి కారకులేవరో గుర్తించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు