సాక్షి, తిరుమల : వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 10 రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని, రోజుకు 30 వేల మందికి దర్శనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఉదయం 4 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. ముందుగా వీఐపీ ప్రొటోకాల్, శ్రీవారి ట్రస్ట్ భక్తులకు అనుమతి ఉంటుందని, ఉదయం 7:30 నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కోరారు.