సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌

12 Oct, 2022 18:27 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ బుధవారం కలిశారు. కొత్త రాష్ట్రమైనా, ఆర్థిక ఇబ్బందులున్నా.. కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ బాగా చేశారని సీఎంను జెన్నిఫర్‌ అభినందించారు. జీడీపీ గ్రోత్‌రేట్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉండటంపై ఆమె ప్రశంసించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని సీఎం పేర్కొన్నారు.


చదవండి: ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు 

మరిన్ని వార్తలు