సాక్షి,చిత్తూరు: తిరుపతిలోని నారాయణ గార్డెన్స్లో ఆనందయ్య మందు తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య మందు తయారీ జరగనుంది. కాగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఆనందయ్య మందును సిద్ధం చేయిస్తున్నట్లు చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ ఆధ్వర్యంలో మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆనందయ్య కరోనా మందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక్కడ చదవండి: Krishnapatnam Medicine: ప్రతి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ