సాక్షి, అనంతపురం: హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది నెలలు మోసి కని పెంచిన కొడుకును తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టిన ఘటన నికంపల్లిలో వెలుగుచూసింది. రెండు నెలల మగబిడ్డను 20 వేలకు ఆశపడి మహబూబ్ బాషా, షరీన్ దంపతులకు ఆమ్మేశారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత స్థానికలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. సొంత బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.