దారుణం: రెండు నెలల కొడుకుని అమ్మేసిన తల్లిదండ్రులు

27 Mar, 2021 14:15 IST|Sakshi

సాక్షి, అనంతపురం: హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది నెలలు మోసి కని పెంచిన కొడుకును తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టిన ఘటన నికంపల్లిలో వెలుగుచూసింది. రెండు నెలల మగబిడ్డను 20 వేలకు ఆశపడి మహబూబ్ బాషా, షరీన్ దంపతులకు ఆమ్మేశారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత స్థానికలు  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. సొంత బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్‌ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌

మరిన్ని వార్తలు