సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం ప్రారంభమయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉచిత పంటల బీమా పథకం అమలు, ఇళ్లపట్టాల నిర్మాణం, గృహనిర్మాణ పథకాలపై కూడా కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డీఏ బకాయిల చెల్లింపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే రాష్ట్రంలో నివర్ తుపాను ప్రభావం మీద అధికారులు కేబినెట్కు వివరించనున్నారు.