ఏపీలో కొత్తగా 8,218 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 10,820 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ విజేతల సంఖ్య 5,30, 711కు చేరుకుంది. ఇక రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య జోరుగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 74,595 శాంపిళ్లను పరీక్షించగా, 8,218 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్టుల సంఖ్య 50,33,676కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 617776కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 81763 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 58గా నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5302కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.