సాక్షి,అమరావతి:గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 68,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా1,433 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 15 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,686 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,815 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19 లక్షల 67 వేల 472 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,58,35,650 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.