సాక్షి,అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 64,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,321 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి19 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,807 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,499 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19 లక్షల 81 వేల 906 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం14,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,64,71,272 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి: అమ్మా..! నాకూ, తమ్ముడికి ఈత రాదు