ఏపీలో కొత్తగా 1,115 కరోనా కేసులు..

31 Aug, 2021 17:03 IST|Sakshi

సాక్షి,అమరావతి:  గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి19 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,857  కు చేరింది. గడిచిన 24 గంటల్లో  1,265 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19లక్షల 85 వేల 566 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం14,693యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు  2,66,29,314 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: Dale Steyn: అన్ని క్రికెట్‌ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టార్‌ బౌలర్‌

మరిన్ని వార్తలు