ఏపీ: 26 జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు వీరే..

19 Apr, 2022 18:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.

జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రుల వివరాలు

జిల్లా పేరు ఇన్‌చార్జి మంత్రి
1 గుంటూరు ధర్మాన ప్రసాదరావు
2 కాకినాడ సీదిరి అప్పల రాజు
3 శీ​కాకుళం బొత్స సత్యనారాయణ
4 అనకాపల్లి రాజన్న దొర
5 ఏఎస్‌ఆర్‌ఆర్‌  గుడివాడ అమర్నాథ్‌
6 విజయనగరం బూడి ముత్యాల నాయుడు
7 పశ్చిమ గోదావరి దాటిశెట్టి రాజా
8  ఏలూరు పినిపె విశ్వరూప్‌
9 తూర్పుగోదావరి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌
10 ఎన్టీఆర్‌ తానేటి వనిత
11  పల్నాడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు
12 బాపట్ల కొట్టు సత్యనారాయణ
13 అమలాపురం జోగి రమేష్‌
14 ఒంగోలు మేరుగ నాగార్జున
15 విశాఖపట్నం విడదల రజిని
16 నెల్లూరు అంబటి రాంబాబు
17 కడప ఆదిమూలపు సురేష్‌
18 అన్నమయ్య కాకాణి గోవర్థన్‌రెడ్డి
19 అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20 కృష్ణా ఆర్కే రోజా
21 తిరుపతి నారాయణ స్వామి
22 నంద్యాల అంజాద్‌ బాషా
23 కర్నూలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
24 సత్యసాయి గుమ్మనూరి జయరాం
25 చిత్తూరు కేవి ఉషాశ్రీ చరణ్‌
26  పార్వతీపురం గుడివాడ అమర్నాథ్‌


 

మరిన్ని వార్తలు