ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేదం.. ఆ రోజు నుంచే అమల్లోకి.. ఉత్తర్వులు జారీ

22 Sep, 2022 20:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేదం విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేదం నవంబర్‌ 1 నుంచి అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు ముద్రించడం, అంటించడం, రవాణాపైన నిషేదం విధించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ ప్రింటింగ్‌ మెటీరియల్‌ ఇంపోర్ట్‌పైనా నిషేదం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

చదవండి: (ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్)

మరిన్ని వార్తలు