సుప్రీంకోర్టు కమిటీకి రవాణా శాఖ నివేదిక
రాత్రి 8 గంటల తర్వాత మద్యం దొరక్కపోవడమే ప్రధాన కారణం
డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు 3,829 మంది
అతి వేగంతో వెళుతున్న 5,888 మందిపై కేసులు
హెల్మెట్ లేని 11,686 మంది.. సీటు బెల్టు ధరించని 1,547 మందిపై కేసులు
సాక్షి, అమరావతి: గత ఆర్నెల్లలో రాష్ట్రంలో డ్రంకన్ డ్రైవ్ కేసులు కేవలం మూడు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో రహదారి భద్రత ఉల్లంఘనలపై రవాణా శాఖ రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి తాజాగా నివేదిక పంపింది. మద్య నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే డ్రంకన్ డ్రైవ్ కేసులు తగ్గిపోయాయని సుప్రీంకోర్టు కమిటీకి నివేదించింది.
టోల్గేట్లలో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలను రవాణా శాఖ ముమ్మరం చేయడంతో కేసులు తగ్గిపోయాయి. ఈ మూడు కేసులు గుంటూరు జిల్లాలో రెండు, కృష్ణా జిల్లాలో ఒకటి నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆర్నెల్ల వ్యవధిలో 2 వేలకు పైగా డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ఈ దఫా సింగిల్ డిజిట్కే పరిమితం కావడం గమనార్హం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకాలు లేకపోవడం, ఎక్కడా మద్యం దొరక్కపోవడం ప్రధాన కారణాలుగా రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: రూ.8,000 కోట్లతో ‘ఉపాధి’)
సుప్రీంకోర్టు కమిటీకి పంపిన నివేదికలో ప్రధానాంశాలివే...
రాష్ట్రంలో గత ఆర్నెల్లలో ట్రాఫిక్ ఉల్లంఘనలివే...
జిల్లా డ్రంకన్ డ్రైవ్ అతి వేగం డ్రైవింగ్ లైసెన్సు లేని
అనంతపురం | 0 | 320 | 327 |
చిత్తూరు | 0 | 8 | 269 |
తూర్పుగోదావరి | 0 | 30 | 289 |
గుంటూరు | 2 | 1 | 459 |
కృష్ణా | 1 | 1 | 101 |
కర్నూలు | 0 | 147 | 330 |
నెల్లూరు | 0 | 1,926 | 603 |
ప్రకాశం | 0 | 2 | 146 |
శ్రీకాకుళం | 0 | 0 | 8 |
విశాఖపట్నం | 0 | 3,446 | 302 |
విజయనగరం | 0 | 0 | 42 |
పశ్చిమగోదావరి | 0 | 7 | 722 |
వైఎస్సార్ కడప | 0 | 0 | 231 |
మొత్తం | 3 | 5,888 | 3,829 |