ప్రత్యేకంగా ‘యూసీఐఎంఎస్’ యాప్ రూపొందించిన పురపాలక శాఖ
వార్డు సచివాలయం స్థాయిలోనే చెక్
ఫొటోలు, వీడియోలు అప్లోడ్
వెనువెంటనే జరిమానా, జప్తు లేదా కూల్చివేత
దేశంలోనే తొలిసారిగా వినూత్న విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాల దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. సాంకేతిక పరిజ్ఞానంతో వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం ‘అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (యూసీఐఎంఎస్) పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ విధానం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ యాప్ సహకారంతో రాష్ట్రంలోని 120 పట్టణ స్థానిక సంస్థలు, 17 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో అక్రమ, అనధికార నిర్మాణాలకు చెక్ పెట్టనున్నారు. వార్డు సచివాలయ స్థాయి నుంచి పురపాలక శాఖ టౌన్ ప్లానింగ్ డైరెక్టరేట్ స్థాయి వరకు ఈ యాప్ అనుసంధానమై ఉంటుంది. దీనిపై ఇప్పటికే 3,775 వార్డు సచివాలయాల్లో ప్రణాళిక కార్యదర్శులకు అవగాహన కల్పించారు. త్వరలో ఈ యాప్ను అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు.
యాప్ పనితీరు ఇలా..
సామాన్యులకు ప్రయోజనం
అక్రమ, అనధికార నిర్మాణాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందరో కొనుగోలుదారులు మోసపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయం కోల్పోతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించాం. దాంతో అక్రమ కట్టడాలను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.
- వి.రాముడు, డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ విభాగం, పురపాలక శాఖ