ఏపీలో కొత్తగా 4,458 కరోనా కేసులు

25 Jun, 2021 17:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 91,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,458 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,528 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,313 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 08 వేల 262 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 47,790 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,15,41,485 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

చదవండి: కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

మరిన్ని వార్తలు