ఏపీలో కొత్తగా 3,175 కరోనా కేసులు

4 Jul, 2021 18:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. రికవరీలు కూడా పెరుగుతండటం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 94,595 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,175 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 29 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,844 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,692 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 54 వేల 754 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 35,325 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,23,63,078 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు