ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు

29 Jun, 2021 17:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 91,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 41 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,671కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,757 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 32వేల 971 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 40,074 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,18,95,922 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి: థర్డ్‌ వేవ్‌ ప్రిపరేషన్‌ : కేంద్రం కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు