సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,040 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ ప్రభావంతో 14 మంది మృతి చెందారు. తాజాగా 4,576 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు 18,71,098 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో మహమ్మారి బారినపడి మొత్తం 12,960 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.