ఏపీలో కొత్తగా 2,665 కరోనా కేసులు

11 Jul, 2021 18:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 91,677 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,665 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 16 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,002 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,231 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 78 వేల 266 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,29,86,288 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు