ఏపీలో కొత్తగా 4,981 కరోనా కేసులు

24 Jun, 2021 16:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 88,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,981 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,490 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,464 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 04 వేల 844 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 49,683 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,14,49,636 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

చదవండి: జగనన్న కాలనీల్లో  ‘పవర్‌’ఫుల్‌ లైన్లు

మరిన్ని వార్తలు