ఏపీలో కొత్తగా 1,246 కరోనా పాజిటివ్‌ కేసులు

24 Sep, 2021 18:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 55,323  కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,246 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,44,490కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 14,118కి పెరిగింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం బులెటిన్‌ను విడుదల చేసింది.

వైరస్‌ నుంచి 1,450 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,535 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 20,16,837 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 14, 118 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 2,79,80,792 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.
చదవండి: భారత్‌లో కొత్త వేరియంట్‌పై ఆధారాల్లేవు

మరిన్ని వార్తలు