దుబాయ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్‌

22 Feb, 2021 15:20 IST|Sakshi
ఫుడ్‌ ఫెస్టివల్‌లో మాట్లాడుతున్న పూనంమాలకొండయ్య

సాక్షి, అమరావతి: దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫ్‌ ఫుడ్‌–2021 ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుడ్‌ ప్రోసెసింగ్‌ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు జరిగే ఈ గల్ఫ్‌ ఫుడ్‌–2021 ఫెస్టివల్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడారు.

ఏపీలో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఈ స్టాల్‌లో ఏపీలో ఉన్న వనరులు, పంట ఉత్పత్తుల వివరాలు, పెట్టుబడిదారులకున్న అవకాశాలను చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సీఈవో శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

చదవండి:
పాస్‌పోర్ట్‌కూ ‘డిజి లాకర్‌’.. ఒరిజినల్‌ డాక్యుమెంట్లను వెంట తీసుకురానక్కర్లేదు

తగ్గుతున్న నిరుద్యోగిత.. రికార్డుస్థాయిలో ఉద్యోగాలు

మరిన్ని వార్తలు