‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్‌

24 Apr, 2021 08:16 IST|Sakshi

నేడు ప్రధాని చేతుల మీదుగా అవార్డుల ప్రదానం 

సాక్షి, అమరావతి: సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత మన రాష్ట్రంలో పైరవీలకు తావులేని పాలన నడుస్తోంది. ఫలితంగా గ్రామ పాలన వికసిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది మన రాష్ట్రం ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించే సమావేశంలో శనివారం ఈ అవార్డులను  ప్రదానం చేయనున్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడినట్టు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించింది.

చదవండి: తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు 
సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం

మరిన్ని వార్తలు