గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

4 Feb, 2023 09:56 IST|Sakshi

సాక్షి, అమరా­వతి: దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. 

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రాంప్రకాష్‌ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్‌ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు