స్థానిక సంస్కరణల్లో ఏపీ నెంబర్‌వన్‌

23 Dec, 2020 18:58 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ కూడా

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. మెరుగైన ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణ, స్థానిక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, మెరుగైన పౌర సేవలను కేంద్రం గుర్తించింది. మరింత రుణ సౌకర్యానికి అనుమతినిచ్చింది. ఏపీకి 2,525 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్‌కు 2,373 కోట్ల రూపాయలు రుణ సౌకర్యం కల్పించింది. ( ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు )

కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల జీఎస్‌డీపీపై రెండు శాతం అదనంగా రుణం తీసుకునే సౌకర్యానిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఓ నాలుగు సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే రుణ సౌకర్యానికి అవకాశం ఇవ్వగా.. ఏపీ ఆ సంస్కరణలను విజయవంతంగా అమలు చేసింది.

మరిన్ని వార్తలు