ఏపీ: 20న అసెంబ్లీ, మండలి సమావేశాలు

14 May, 2021 09:51 IST|Sakshi

నోటిఫికేషన్‌ జారీ చేసిన గవర్నర్‌

సాక్షి, అమరావతి: పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఈ నెల 20వ తేదీన అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు రెండు చోట్లా సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కోవిడ్‌–19 ఉధృతి, వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఈ సమావేశాలను ఒక రోజుకే పరిమితం చేయాలా? లేదా మరి కొన్ని రోజులు నిర్వహించాలా అనే విషయంపై శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

చదవండి: ఏపీ: మత్స్యకారులకు గుడ్‌ న్యూస్‌..
సీఎం జగన్‌ లేఖతోనే కదలిక 

మరిన్ని వార్తలు