రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిది కాదు

20 Aug, 2020 16:19 IST|Sakshi

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 

సాక్షి, శ్రీకాకుళం: రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో సింగపూర్, జపాన్ తరహా రాజధాని అంటూ చంద్రబాబు హడావుడి చేశారు తప్ప.. చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలో పోర్టు ఎందుకు కట్టలేదో.. చర్చకు రావాలని చంద్రబాబును ఆయన నిలదీశారు. అమరావతి రాజధాని నిర్మాణంపై ఆనాడు చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. ప్రారంభోత్సవం అంటే ప్రధాని మోదీ వచ్చారు తప్ప.. అప్పుడు కూడా చంద్రబాబును బీజేపీ ప్రశ్నించలేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. (చదవండి: కేంద్రం నిధులతో చంద్రబాబు సర్కారు సోకులు చేసింది

మరిన్ని వార్తలు