సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లోకుల గాంధీ చికిత్స నిమ్మితం విశాఖ కేజీహెచ్లో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందారు. లోకుల గాంధీ మృతి పట్ల ఏపీ బీజేపీ అధక్షుడు సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు.
చాలా చాలా బాధాకరమైన విషయం, భగవంతుడి ఆటలో ఎవరి వంతు ఎప్పుడో చెప్పలేని పరిస్థితి, ఈ క్షణం మనతో ఉన్నా, మరు క్షణం కూడా మనతోనే ఉంటారని నమ్మకంగా చెప్పలేని రోజులివి.
ఒళ్ళంతా జాతీయతను నింపుకుని, నిరంతరం దేశం కోసం పోరాడుతూ, వందలాది మంది గిరిజనులను ప్రోత్సహించి పార్టీలో చేర్పించి, (1/3) pic.twitter.com/ZbEZirDbwZ
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) August 20, 2021