ఈ నెల 16న ఏపీ కేబినెట్‌ సమావేశం

5 Sep, 2021 08:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సచివాలయంలోని కేబినెట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పేర్కొనాల్సిన  అంశాలను 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్‌ విభాగం)కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.   

ఇవీ చదవండి:
ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ
ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు

మరిన్ని వార్తలు