ఏపీ: కరోనా పరిస్థితులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

27 May, 2021 13:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా పరిస్థితులపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం ఆళ్లనాని అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. కరోనా కట్టడి, బ్లాక్‌ ఫంగస్‌, ఆక్సిజన్‌ సరఫరాపై చర్చ జరపడంతో పాటు, బ్లాక్‌ఫంగస్‌ మందులు, ఇంజక్షన్ల కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చ చేపట్టింది. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు హాజరయ్యారు.

చదవండి: ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయం ఏంటో?: ఏపీ హైకోర్టు 
అర్చకులపై ఏపీ సర్కార్‌ వరాల జల్లు..

>
మరిన్ని వార్తలు