సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్‌

25 Dec, 2021 15:21 IST|Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల వైఎస్సార్‌ జిల్లా పర్యటన ముగిసింది. పలు అభివృద్ధికార్యక్రమాల శంకుస్థాపన, పథకాల అమలు, ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.  అనంతరం శనివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు.  ముందుగా నోవాటెల్‌ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌..  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు.

>
మరిన్ని వార్తలు