2.42 కోట్ల మంది బ్యాంకు ఖాతాలకు రూ.18,721 కోట్లు జమ
మహిళా పక్షపాతిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం
దేశ చరిత్రలోనే స్త్రీమూర్తులకు పెద్ద ఎత్తున నగదు జమ ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా పక్షపాతి ప్రభుత్వంగా నిరూపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తన 16 నెలల వ్యవధిలో కేవలం నాలుగు పథకాల ద్వారానే 2,42,73,936 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.18,721.12 కోట్ల నగదును బదిలీ చేయడం విశేషం. ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు తీసుకోకుండా జమ చేయడం గమనార్హం. దేశ చరిత్రలోనే ఇంత పెద్దఎత్తున మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి. (చదవండి: స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)
1) వైఎస్సార్ ఆసరా- 87.74 లక్షల మందికి రూ.6,792.21 కోట్లు
2) సున్నా వడ్డీ పథకం- 90.37లక్షల మందికి రూ.1400.08 కోట్లు
3) వైఎస్సార్ చేయూత- 22.28 లక్షల మందికి రూ.4,179.20 కోట్లు
4) అమ్మ ఒడి- 42.33 లక్షల మందికి రూ.6349.63 కోట్లు
నాతో పాటు మా అత్తకూ పథకాలు
మా కుటుంబంలో నాకు అమ్మ ఒడి కింద రూ.15 వేలు, సున్నా వడ్డీ కింద రూ.3 వేలు, ఆసరా కింద రూ.10,800 బ్యాంకులో జమ చేశారు. మా అత్త బ్రహ్మమ్మకు చేయూత కింద డబ్బులు జమ చేశారు. సున్నా వడ్డీ కింద రూ.3 వేలు, ఆసరా కింద రూ.10,800 బ్యాంకులో వేశారు. ఇలా మా బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు వేయడం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు.
- సి.అనిత, ఎఎస్పాడు గ్రామం, మండలం, ప్రకాశం జిల్లా
ప్రభుత్వం డబ్బులు వేయడం ఇప్పుడే చూస్తున్నాం
మా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఎన్నికలకు ముందు చెప్పిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, అమ్మ ఒడి కింద నా బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేశారు.
- కోబాకు తనూజ, నిడిగల్లు పంచాయతీ, బాలాయపల్లి మండలం, నెల్లూరు జిల్లా