ప్రజలకు గవర్నర్, సీఎం జగన్‌‌ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

10 Aug, 2020 19:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జన్మాష్టమి పండుగ భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని గవర్నర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక పునాది. సమాజంలో శాంతి, స్నేహం, సోదరభావం, ప్రజా శ్రేయస్సు నెలకొల్పేందుకు ఈ శుభ దినం ప్రతీకగా నిలుస్తుంది’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. అలాగే కృష్ణాష్టమిని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారని, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు  సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు