ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తికావాలి: సీఎం జగన్‌

26 Jul, 2021 18:28 IST|Sakshi

పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశం

అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, అగ్రి ఇన్‌ఫ్రా), పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతంపై చేపడుతున్న కీలక ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. రెండో దశ పనులకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు.

ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. మల్టీ పర్పస్‌ సెంటర్లు, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాససింగ్, ఫిషింగ్‌ హార్బర్లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు తదితర అంశాలపై సీఎం సమీక్ష  నిర్వహించారు. వీటన్నింటి కోసం దాదాపుగా రూ.16,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు(ఎంపీఎప్‌సీ):
రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకే రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు (ఎంపీఎఫ్‌సీలు), దీనిలో భాగంగా ఆర్బీకేల వద్ద 15 రకాల మౌలిక సదుపాయాలు
డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంలు, గోడౌన్లు, హార్టికల్చర్‌ మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు, అసేయింగ్‌ ఎక్విప్‌ మెంట్లు.
మార్కెట్‌ యార్డుల్లో నాడు–నేడు కింద పనులతో పాటు ఇ–మార్కెటింగ్‌  వీటన్నింటికోసం అంచనా ఖర్చు రూ.2930 కోట్లు 

కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు
ఆర్బీకేల స్ధాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు 
నియోజకవర్గాల స్ధాయిలో ఫామ్‌ మెకనైజేషన్‌ (హైటెక్‌ హై వాల్యూ హబ్స్‌) ఏర్పాటు
తొలిదశలో 3250 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు, ఇదివరకే ప్రారంభం
రెండో దశలో కింద సెప్టెంబరు నాటికి మరో 3250 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు, వీటిలో 500 హార్వెస్టర్లు, 85 హబ్స్‌ ఏర్పాటు
మూడో దశలో భాగంగా డిసెంబరు నాటికి 4250 కమ్యూనిటీ సెంటర్లు, 535 హార్వెస్టర్లు, 85 హబ్స్‌ ఏర్పాటు
మొత్తంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, 1035 కంబైన్డ్‌ హార్వెస్టర్లు, 175 హబ్స్‌ ఏర్పాటు
వీటికోసం దాదాపు రూ.2,134 కోట్లు అంచనా

కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల వల్ల రైతులకు అందుబాటులో పరికరాలు ఉంటాయి: సీఎం
కూలీల కొరత సమస్య తగ్గుతుంది: సీఎం
తక్కువ ఖర్చుకే అందుబాటులోకి వ్యవసాయ ఉపకరణాలు  ఉంటాయి:
వ్యవసాయ పరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యాలు పెంచాలని సీఎం ఆదేశం..
ఐటీఐ, పాలిటెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లో ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశం
దీనివల్ల గ్రామస్ధాయిలో వ్యవసాయ యంత్రపరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉంటాయన్న సీఎం
ఏ యంత్ర పరికరం ఎంత అద్దెకు లభ్యమవుతుందన్న విషయాన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలని సీఎం ఆదేశం
ఈ విషయంలో రైతులతో ఏర్పడ్డ రైతుసలహామండలి అభిప్రాయలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలనిఅధికారులకు స్పష్టం చేసిన సీఎం
పాల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంబంధిత పరికరాలున్న కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను పెట్టాలని సీఎం ఆదేశం

సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాససింగ్‌ యూనిట్స్‌
రాష్ట్రంలో 33 చోట్ల సీడ్‌ కం మిల్లెట్‌ ప్రాససింగ్‌ యూనిట్లు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయం
కొన్ని చోట్ల అవసరాన్నిబట్టి ఒకటికి మించి యూనిట్ల ఏర్పాటు
ఇప్పటికే యూనిట్ల ఏర్పాటుకు దాదాపు పూర్తైన స్ధలాల గుర్తింపు
సీఎంకు వివరాలు అందించిన అధికారులు

ఏఎంసీలు–బీఎంసీలు
జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు ఏర్పాటు, వీటికోసం అంచనా వ్యయం రూ.4,190 కోట్లు

సెప్టెంబరులో ఆసరా ఇవ్వబోతున్నాం సీఎం
ఇప్పటికే చేయూత కింద డబ్బు ఇచ్చాం: సీఎం
ఈ డబ్బు మహిళల సుస్ధిర ఆర్ధికాభివృద్ధికి దోహదపడాలి
కోరుకున్న వారికి ఆవులు, గొర్రెలు పంపిణీ చేయాలి
అధికారులకు సీఎం ఆదేశం

మత్స్యశాఖపైనా సీఎం జగన్‌ సమీక్ష
సముద్రతీర ప్రాంతాల్లో భారీగా ఫిషింగ్‌ హార్బర్లను, ఫిష్‌ ల్యాండ్‌సెంటర్లపై సీఎం సమీక్ష
ఇందులో భాగంగానే చేపలు, రొయ్యల ప్రాససింగ్‌ యూనిట్లు
ప్రి ప్రాససింగ్‌ యూనిట్లు, పిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లు,
ఆక్వా హబ్స్‌ నిర్మాణం, దీనికోసం రూ.3997 కోట్లు ఖర్చువుతుందని అంచనా

ఆక్వాలో 10 ప్రాససింగ్‌ యూనిట్లు, 23 ప్రీ ప్రాససింగ్‌ యూనిట్లు, 100 ఆక్వా హబ్స్‌ మొత్తంగా 133 ఏర్పాటు
2022 సెప్టెంబరు నెలాఖరునాటికి  ప్రాససింగ్‌ యూనిట్ల కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు ప్రణాళిక
మంచినీళ్లపేటలో దాదాపుగా పూర్తి కావొచ్చిన ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ పనులు
చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, కొత్తపట్నంలోనూ పిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు నిర్మాణంతో పాటు మరో 20 ప్రాంతాల్లో ప్లోటింగ్‌ జెట్టీల ఏర్పాటుకు ప్రయత్నాలు
ఇప్పటికే ఉన్న 340 పిష్‌ ల్యాండింగ్‌ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం
దీనికోసం దాదాపు రూ.91 కోట్లకు పైగా ఖర్చు
వేలం పాట కోసం హాలు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాం, మరమ్మతులు, ఇంటర్నల్‌ రోడ్లు, బయోఫెన్సింగ్, సెక్యూరిటీ గేట్లు, వీధిలైట్లు, మల్టీపర్పస్‌ యుటిలిటీ ఫ్లాట్‌ఫాం, పరిశుభ్రంగా ఉంచడానికి మోటార్‌ విత్‌ బూస్టర్‌ పంపు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
తద్వారా మత్స్యకారులకు మెరుగైన మౌలిక సదుపాయల కల్పనే లక్ష్యం

ఫిషింగ్‌ హార్భర్లలో పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం
8 ఫిషింగ్‌ హార్భరలో 4 చోట్ల నిర్మాణపనులు జరుగుతున్నాయన్న అధికారులు
మిగిలిన 4 చోట్ల కూడా పనులు త్వరగా మొదలుపెట్టాలని సీఎం ఆదేశం
 
పుడ్‌ ప్రాససింగ్‌ సెంటర్లు
ఏపీ పుడ్‌ ప్రాససింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో సెకండరీ పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు
మైక్రో పుడ్‌ ప్రాససింగ్‌ ఎంటర్‌ప్రైజస్, క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబులు, స్కిల్‌ డవలప్‌మెంట్‌ మరియు ఇంక్యుబేషన్‌ సెంటర్లు, 
సీడ్‌ కం మిల్లెట్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు
రైతుభరోసా కేంద్రాలస్ధాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయం
దీనికోసం రూ.2,961 కోట్లు అంచనా

రైతులకు మేలు జరిగేలా..
వరి, పత్తి మినహా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం భారీగా పంటలకొనుగోళ్లు చేసింది: సీఎం
ఎన్నడూలేని విధంగా పండ్లు, పొగాకులాంటి ఉత్పత్తులకూ కనీస గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులను ఆదుకునే చర్యలను చేపట్టింది: సీఎం
దీనికోసం దాదాపుగా రూ.6200 కోట్లు (వరి, పత్తి మినహా) ఖర్చు చేసింది: సీఎం
ఫుడ్‌ ప్రాససింగ్‌ విధానాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా రైతులకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం
రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు, ఆహార రంగంలో పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాథి తదితర అంశాల్లో కూడా మేలు జరుగుతుంది:
ప్రభుత్వానికి కూడా వెసులుబాటు వస్తుంది
రైతుల ఉత్పత్తులు ఈ ప్రాససింగ్‌ యూనిట్ల ద్వారా నాణ్యమైన పద్ధతుల్లో వినియోగదారులకు చేరుతాయి

పశుసంవర్ధక శాఖ
పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో దేశీయ ఆవుల ఫార్మ్స్‌
ఆర్గానిక్‌ డెయిరీల ఏర్పాటుకు నిర్ణయం
ఆర్బీకేల స్ధాయిలోనే పశుసంవర్ధక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు
దీనికోసం రూ.22.25 కోట్లు అంచనా
ఆర్బీకేల స్థాయిలో సెప్టెంబరు నుంచి పనులు ప్రారంభానికి సన్నద్ధమవుతున్న ప్రభుత్వం 

మరిన్ని వార్తలు