మహాత్ముడికి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళి

30 Jan, 2021 12:40 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు..

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. చదవండి: సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి

మరిన్ని వార్తలు