స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఉన్న ఉద్యోగాలు 3,97,128
ఈ మూడేళ్లలోనే అందులో సగం కంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీ
స్వయం ఉపాధి పొందే 55,57,939 మంది అక్కచెల్లెమ్మలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక చేయూత
మూడేళ్లలో స్వయం ఉపాధి పథకాల కోసం రూ.19,129.05 కోట్లు వ్యయం
ఈ చర్యలన్నింటితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరుగులు
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో శాశ్వత ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 3,97,128 ఉంటే, అధికారం చేపట్టిన వెంటనే 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. సోమవారం శాసనసభలో ‘పారిశ్రామికాభివృద్ధి–పెట్టుబడులు–రాష్ట్ర ఆర్థిక పరిస్థితి’ అంశంపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు సీఎం జగన్ సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం 2,06,638 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. మొత్తంగా సగం ఉద్యోగాలు మనందరి ప్రభుత్వంలోనే భర్తీ చేశామన్నారు. ఇవికాక కాంట్రాక్ట్ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్లో 3.71 లక్షల ఉద్యోగాలు.. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగామని వివరించారు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కల్పించామని, ఇందులో 83– 84 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలే ఉన్నారని.. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు అని తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల దశాబ్దాల వారి కల నెరవేరుస్తూ 51,387 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో రికార్డు స్థాయిలో 16,880 రెగ్యులర్ ఉద్యోగాలు, పాఠశాల విద్యా శాఖలో 6,360 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ‘ఆప్కాస్ క్రియట్ చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గొప్ప మేలు చేశాం. గతంలో ఉద్యోగం ఇచ్చేటప్పుడూ లంచాలే. మళ్లీ జీతాలిచ్చేటప్పుడు కూడా లంచాలు తీసుకునే అధ్వాన్నమైన పరిస్థితి. ఈ వ్యవస్థను మార్చేశాం.
95,212 మంది ఇవాళ ఆప్కాస్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ 6.16 లక్షల ఉద్యోగాల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 2,60,867 మంది వలంటీర్లగా సేవలందిస్తున్నారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్గా పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రజలకు తోడుగా ఉంటున్నారు. నేను చెబుతున్న 6,16,323 మంది ఉద్యోగులు మన కళ్లముందే కనిపిస్తున్నారు. ఎవరైనా జగన్ ప్రభుత్వం ఉద్యోగాలివ్వలేదని చెబితే అవి పచ్చి అబద్ధాలు అని చెప్పడానికి ఈ ఉద్యోగాలే సాక్ష్యం’ అని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే..
స్వయం ఉపాధికి చేయూత
ఉద్యోగాల కల్పన వివరాలు
2014 నుంచి 2019 వరకు బాబు హయాంలో కల్పించిన ఉద్యోగాలు: 34,108
2019 మే వరకు ఉన్న ఉద్యోగాలు: 3,97,128
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగాలు..
ఎ. పర్మినెంట్ ఉద్యోగాలు: 2,06,638
బి. కాంట్రాక్టు ఉద్యోగాలు: 37,908
సి. ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగాలు: 3,71,777
ఎ+బి+సి–మొత్తం: 6,16,323