సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్షా, జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్షెకావత్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.
చదవండి: వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు
సీఎం జగన్ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు