ఏపీ: సీఎం జగన్‌ను కలిసిన సీఎస్‌ ఆదిత్యానాథ్‌ దాస్‌

28 Jun, 2021 14:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

మరిన్ని వార్తలు