సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఆదర్శవంతంగా వాలంటీర్లు నిలుస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు ఎస్ఆర్ పురంలో ప్రభుత్వ పథకాలపై వాలంటీర్లతో నారాయణస్వామి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి పథకాన్ని అర్హులకు అందిస్తున్నారని ప్రశంసించారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తప్పు పట్టడం సిగ్గుచేటన్నారు. మంచి కార్యక్రమాలు ఏవి జరిగిన చంద్రబాబుకు గిట్టవని దుయ్యబట్టారు.
చదవండి: ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు