AP: ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్‌ జీవోపై ఆర్థిక శాఖ సీరియస్‌

28 Jan, 2023 13:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్‌ జీవోపై ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌పై సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఫేక్‌ జీవోపై గుంటూరు డీఐజీకి ఆర్థికశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ ఎస్పీని డీఐజీ ఆదేశించారు.

మేమెలాంటి సర్వే చేయలేదు..
ఇదిలా ఉండగా, ఎల్లో మీడియాలో ప్రచురి­తమైన ‘మంత్రులకు ముచ్చెమటలే’ వార్త పూ­­ర్తిగా అబద్ధమని ఐ–ప్యాక్‌ సంస్థ శుక్రవా­రం ట్విట్టర్‌లో స్పష్టంచేసింది. తాము ఎలాంటి సర్వేలు చేయలేదని తేల్చిచెప్పింది. ఐ–­ప్యాక్‌ సర్వే చేసినట్లు ప్రచురించిన కథనాల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదని ట్వీట్‌ చేసింది.
చదవండి: లోకేష్‌ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌట్‌ అవుతుందా? 

మరిన్ని వార్తలు