సాక్షి, అమరావతి: ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్ జీవోపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. ఉద్యోగుల రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ జీవోపై గుంటూరు డీఐజీకి ఆర్థికశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ ఎస్పీని డీఐజీ ఆదేశించారు.
మేమెలాంటి సర్వే చేయలేదు..
ఇదిలా ఉండగా, ఎల్లో మీడియాలో ప్రచురితమైన ‘మంత్రులకు ముచ్చెమటలే’ వార్త పూర్తిగా అబద్ధమని ఐ–ప్యాక్ సంస్థ శుక్రవారం ట్విట్టర్లో స్పష్టంచేసింది. తాము ఎలాంటి సర్వేలు చేయలేదని తేల్చిచెప్పింది. ఐ–ప్యాక్ సర్వే చేసినట్లు ప్రచురించిన కథనాల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదని ట్వీట్ చేసింది.
చదవండి: లోకేష్ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌట్ అవుతుందా?
#Factcheck
G.O. (pdf file named as GO MS NO15. ANDHRA PRADESH) mentioning that the age of retirement of Government employees is raised from 62 years to 65 years is under circulation.No such G.O. has been issued by the Finance Department, Government of Andhra Pradesh. pic.twitter.com/8CuFVVHzJp
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 28, 2023