గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై సీఎం జగన్‌ సమీక్ష

27 Feb, 2023 21:47 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్‌ కరికాల వలవెన్‌, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్‌ ఎస్‌ ఎస్ రావత్‌, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు వేదికగా పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సానుకూలతలను ప్రభుత్వం వివరించనుంది. తద్వారా పెట్టుబడుల ఆకర్షణకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ సదస్సును వేదిక చేసుకోనుంది.

ఇక సమీక్షలో భాగంగా కార్యక్రమాల షెడ్యూల్‌ను అధికారులు సీఎంకు వివరించారు. వేదిక వద్ద జరుగుతున్న పనులు తదితర అంశాలను తెలియజేశారు. ఈ సదస్సుకు వస్తున్న కేంద్రమంత్రులు, వ్యాపారవేత్తలు తదితర వివరాలను సీఎంకు తెలిపారు. సదస్సు నిర్వహణలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు.

► ఉదయం అల్పాహారంతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభం.
► 10 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్న సదస్సు.
► కీలక అంశాలపై సదస్సునుద్దేశించి మాట్లాడనున్న పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు.
► తర్వాత కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు.
► దీనితర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు.
► వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపనున్న సీఎం.
► సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు.
► తొలిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం. 
► తొలిరోజు రాత్రి సభకు హాజరైన వారికి విందు, విందులో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
 
► రెండోరోజున వాలెడిక్టరీ సెషన్‌. 
► ఈ సెషన్లో పాల్గోనున్న పలువురు ప్రముఖులు.
► రెండోరోజునా పలు కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు.
► ముఖ్యమంత్రి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని అధికారులు మొత్తంగా షెడ్యూల్‌ ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు