సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం రిటైల్ పార్క్స్ పాలసీ 2021-2026 ను ప్రకటించింది. రిటైల్ పార్క్ పాలసీ విదివిధానాలతో ఉత్తర్వులు జారీ చేసింది. 2026 నాటికి 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా పాలసీ రూపకల్పన చేశారు. 50 వేల ఉద్యోగాలను రిటైల్ రంగంలో కల్పించాలని టార్గెట్గా పెట్టుకుని పాలసీ రూపొందించారు.