సీఎం జగన్‌ను కలిసిన ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌

29 Jul, 2021 19:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సభ్యులు కలిశారు. వీఆర్‌వోలను సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ను ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ ఛైర్మన్ కే.వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ అరవపాల్‌, వీఆర్‌వో సంఘం ప్రతినిధులు రవీంద్రరాజు, రాజశేఖర్‌, లక్ష్మీనారాయణ, అనిల్‌ సత్కరించారు.

>
మరిన్ని వార్తలు